ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

హైదరాబాద్ : ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ఉదయం 6:30 నిమిషాలకు ప్రారంభంకాగా 10 గంటల వరకు మందకొడిగా సాగింది. 8 గంటలకు 15 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటల తరువాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 11:30 నిమిషాల వరకు 34.28 శాతం నమోదైంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో 1:30 నిమిషాల వరకే పోలింగ్ నిర్వహించారు. అనంతరం పోలీసుల భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఒకటి రెండుచోట్ల మినహా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికాసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశముంది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉప సర్పంచ్ల ఎన్నిక నిర్వహిస్తారు. అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే ఎన్నిక రేపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.